వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
చిరంజీవి పార్టీ ఉహాగానమే:పిసిసి అధినేత
హైదరాబాద్:చిరంజీవి రాజకీయాలలోకి వస్తానంటే కాంగ్రెస్ పార్టీ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని, ఆయన ఎపుడనుకుంటే అపుడు హాయిగా కాంగ్రెస్ లో చేరవచ్చని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తాత్కాలిక అధ్యక్షుడు జి.ఎస్.రావు వ్యాఖ్యానించారు. చిరంజీవి పార్టీ పెట్టే వార్తలన్నీ ఊహాగానాలే అని ఆయన కొట్టిపారేశారు. బయటివారే అన్నీ అనుకుంటున్నారు...చిరంజీవి వింటున్నారు తప్ప ఆయనకుగా ఆయన ఎప్పుడూ పార్టీ పెడతానని అనలేదు...ఇతరులు అనుకున్న విషయాలే మీడియాలో వస్తున్నాయి...చిరంజీవి పార్టీ పెడతారని విషయం తమకైతే చెప్పలేదు...అని పిసిసి అధ్యక్షుడు అన్నారు.
Comments
Story first published: Saturday, September 29, 2007, 23:53 [IST]