వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
తిరుమల కిటకిట
తిరుమల-తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. తమిళనాడు నుంచి భక్తులు వరదలా వస్తుండడంతో శనివారం తిరుమల కిక్కిరిసిపోయింది. ఈ మాసంలో తమిళులు ఉపవాసాలు ఉంటూ తిరుమలను దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. సహజంగానే శని, ఆదివారాల్లో భక్తుల రద్దీ ఎక్కువ ఉంటుంది. దీనికి తోడు ఈ శని, ఆదివారాలలో తమిళనాడు భక్తులు ఉప్పెనలా వస్తుండడంతో ప్రత్యేక సేవలను తిరుమల తిరుపతి దేవస్థానం(టిటిఢి)వారు రద్దు చేశారు. శనివారం మధ్యాహ్నానికే భక్తుల సంఖ్య లక్షన్నర దాటిఉండవచ్చని టిటిడి అధికారులు చెబుతున్నారు.
Comments
Story first published: Saturday, September 29, 2007, 23:53 [IST]