కరుణానిధి సహా డిఎంకె నేతలు దీక్షలు
చెన్నై:
రామసేతు
నిర్మాణాన్ని
చేపట్టాలని
డిమాండు
చేస్తూ
డిఎంకె,
దాని
మిత్రపక్షాలు
సోమవారంనాడు
నిరసన
దీక్షలకు
దిగాయి.
ముఖ్యమంత్రి
కరుణానిధి
కూదడా
నిరసన
దీక్షలో
పాల్గొన్నారు.
అధికార
డిఎంకె,
దాని
మిత్రపక్షాలు
ఇచ్చిన
బంద్
పిలుపుపై
సుప్రీంకోర్టు
స్టే
ఇచ్చింది.
ఈ
స్థితిలో
డిఎంకె
దాని
మిత్రపక్షాల
నాయకులు,
కార్యకర్తలు
నిరసన
దీక్షలకు
దిగారు.
రాష్ట్రవ్యాప్తంగా
బంద్
వాతావరణం
నెలకొంది.
బస్సులు
నడవడం
లేదు.
దుకాణాలు
మూసి
ఉన్నాయి.
రైళ్లు
అంతంత
మాత్రంగానే
నడుస్తున్నాయి.
తమిళనాడు ప్రభుత్వంపై సుప్రీంకోర్టు సోమవారంనాడు చేసిన వ్యాఖ్యలపై మాట్లాడడానికి ముఖ్యమంత్రి కరుణానిధి నిరాకరించారు. కేంద్ర మంత్రి, డిఎంకె నాయకుడు టి.ఆర్. బాలు మాత్రం సుప్రీంకోర్టుపై మండిపడ్డారు. డిఎంకె తీరును అన్నాడియంకె తీవ్రంగా తప్పు పడుతోంది. ప్రభుత్వ ఆదేశాల మేరకే బస్సులు నడవడం లేదని ఆరోపించింది. తమిళనాడు ప్రభుత్వంపై కోర్టు ధిక్కారం కేసు వేసేందుకు అన్నాడియంకె సన్నద్ధమవుతోంది.