వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబా నన్ను విమర్శించేది? వైఎస్

By Staff
|
Google Oneindia TeluguNews


Rajasekhar Reddy హైదరాబాద్: తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడి మీద ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి మంగళవారం మధ్యాహ్నం నిప్పులు చెరిగారు. వైఎస్ గంటకు కోటి రూపాయలు సంపాదిస్తున్నారని చంద్రబాబు నాయుడు చేసిన ఆరోపణ మీద వైఎస్ తీవ్రంగా స్పందించారు.

30 ఏళ్ళుగా ప్రజా జీవితంలో ఉన్న తాను ఎటువంటి వాడినో రాష్ట్ర ప్రజలకు తెలుసని వైఎస్ అన్నారు. తాను పుట్టేనాటికే తన తండ్రి ఆదాయపు పన్ను కట్టేవారని, చదువుకునే రోజుల నుంచి తాను తన పేరు మీద ఆదాయం పన్ను కడుతున్నానని ఆయన చెప్పారు.

1983లో తాను రెండోసారి ఎమ్మేల్యేగా ఎన్నికైనప్పుడు ముఖ్యమంత్రి అయిన ఎన్టీ రామారావు తమ కుటుంబానికి చెందిన ఎపి కార్బైడ్ లో సమస్య సృస్టించారని, ఆ సమయంలో ఆ కంపెనీలో తమ షేర్ క్యాపిటల్ 12 కోట్ల రూపాయలని వైఎస్ వివరించారు. తమ బెరైటిస్ గనుల విలువ 100 కోట్ల రూపాయలని, ఏడేళ్ళ క్రితం తన కుమారుడు జగన్మోహన్ రెడ్డి కర్నాటకలో ప్రారంభించిన పవర్ ప్లాంట్ విలువ ఇప్పుడు 150 కోట్ల రూపాయలని ఆయన చెప్పుకొచ్చారు.

చంద్రబాబు నాయుడి తండ్రికి రెండెకరాల పొలం ఉండేదని, చంద్రబాబు స్కాలర్ షిప్ ల సహాయంతో చదువుకున్నాడని, అటువంటి వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చాక లాది కోట్ల రూపాయలు సంపాదించుకున్నాడని రాజశేఖరరెడ్డి ఆరోపించారు. తెహల్కా డాట్ కామ్ 2000 సంవత్సరంలోనే చంద్రబాబు దేశంలోనే సంపన్న రాజకీయ నాయకుడని రాసిందని, ఆ కాలంలోనే ఆయన 2000 కోట్లకు అధిపతి అని అన్నారు. ఆ సంపద ఈ ఏడున్నర ఏళ్ళ కాలంలో ఎన్ని రెట్లు పెరిగి ఉంటుందో ఊహించుకోవచ్చని తెలిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X