వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పబ్లిసిటీ ఇవ్వకండి: మీడియాకు గౌరు విజ్ఞప్తి
మీడియా తనకు అతిగా పబ్లిసిటీ ఇస్తే మిగతా ఖైదీలకు ఇబ్బంది కలుగుతుందని పెరోల్ పై విడుదలై తన సొంతూరు బ్రాహ్మణ కొట్కూరు చేరుకున్న గౌరు వెంకటరెడ్డి అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ తను ఉండేది 30 రోజులే కాబట్టి తనను తన కుటుంబంతో ప్రశాంతంగా ఉండనివ్వండని ఆయన కొరారు. మీడియా అతిగా పబ్లిసిటీ ఇవ్వడం మూలానా మిగతా ఖైదీలపై తీవ్రప్రభావంపడుతుందని, క్షమాబిక్ష పొందాల్సిన ఖైదీలు సైతం పొందలేక వారు ఇబ్బందులు పడే అవకాశం ఉందని ఆయన అన్నారు. ఇలా పబ్లిసిటీ మూలానా క్షమాబిక్షను ప్రసాదించే సంబంధిత అధికారులు సందిగ్ధంలో పడే అవకాశాలు మెండుగా ఉంటాయని ఆయన అన్నారు. కాగా ఆయన గ్రామానికి చేరుకోగానే గ్రామంలో ఆయన అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.
Comments
Story first published: Thursday, November 1, 2007, 23:53 [IST]