వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రామోజీపై దేవినేని నెహ్రూ విసుర్లు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావుపై కాంగ్రెస్ శాసనసభ్యుడు దేవినేని నెహ్రూ ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంపై తెలుగుదేశం ప్రతిపాదించిన అవిశ్వాసం తీర్మానంపై చర్చలో పాల్గొంటూ ఆయన మంగళవారం ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలను తప్పుపట్టారు. రామోజీపై విమర్శలు చేశారు. దీనికి తెలుగుదేశం సభ్యులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. సభలో లేని వ్యక్తిపై ఆరోపణలు చేయడం సరి కాదని వారన్నారు.

శాసనసభలో సోమవారం జరిగిన చర్చను ఈనాడు పత్రికలో వివక్షాపూరితంగా రాశారని, ఏకపక్షంగా వక్రీకరించి రాశారని నెహ్రూ విమర్శించారు. సాక్షి దినపత్రిక వల్ల వాస్తవాలు తెలుసుకునే అవకాశం కలుగుతోందని, సాక్షి నిష్పాక్షికంగా రాసిందని ఆయన చెప్పారు. ఈ రెండు పత్రికలను ఆయన సభలో ప్రదర్శించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X