వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రాజకీయ లబ్ధికే ఉగ్రవాద ముద్ర: ఆర్ఎస్ఎస్
లక్నో: రాజకీయ లబ్ధి కోసమే యూపీఏ హిందూ సంస్థలపై ఉగ్రవాద ముద్ర వేస్తోందని ఆర్ఎస్ఎస్ చీఫ్ సుదర్శన్ ఆరోపించారు. ఉగ్రవాదాన్ని అదుపు చేయడంలో విఫలమైన యూపీఏ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని హిందూ ఉగ్రవాదాన్ని సృష్టించిందని ఆయన ఆరోపించారు. ఐదురోజుల పాటు ఇక్కడ జరిగే ఆర్ఎస్ఎస్ అవధ్ ప్రాంత సమావేశాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా సుదర్శన్ మాట్లాడుతూ, ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా సమస్యేననీ, దీనికి మతం రంగు పులమడం సబబు కాదని అన్నారు.
Comments
Story first published: Sunday, November 23, 2008, 16:38 [IST]