వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ధవళ వస్త్రాల్లో సాయి దర్శనం
పుట్టపర్తి: భగవాన్ సత్య సాయిబాబా తన జన్మదినం సందర్భంగా భక్తులకు ఆదివారం ధవళ వస్త్రాల్లో దర్శనమిచ్చారు. ఆయన 83వ జన్మదినం సందర్భంగా ఆయనను సందర్శించడానికి భారీ యెత్తున భక్తులు తరలివచ్చారు. సాధారణంగా కాషాయ వస్త్రాలు ధరించే సత్యసాయిబాబు తన జన్మదినం సందర్భంగా ధవళ వస్త్రాలు ధరించారు. ఆయన దర్సనం కోసం ప్రముఖులు పలువురు పుట్టపర్తికి వచ్చారు.
సత్యసాయిబాబాను సందర్శించడానికి ఆదివారం తెల్లవారుజామున మూడు గంటల నుంచే భక్తులు క్యూ కట్టారు. క్యూ నాలుగు కిలోమీటర్ల మేర ఉంది. కొన్ని గంటలకు గాని సత్యసాయిబాబు దర్శనం కాలేదు. భక్తుల కోసం ఉచిత భోజన, వసతి, వైద్య సదుపాయాలు కల్పించారు.
Comments
Story first published: Sunday, November 23, 2008, 16:46 [IST]