వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ప్రముఖుల పేర్లతో సాగునీటి ప్రాజెక్టులు
హైదరాబాద్: సాగునీటి ప్రాజెక్టులకు ప్రముఖుల పేర్లు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈరోజు జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు కొన్ని పేర్లు ఖరారు చేశారు. తెలుగుగంగ ప్రాజెక్టుకు ఎన్టీఆర్ పేరు, పులివెందుల ఎత్తిపోతల పథకానికి కోట్ల విజయభాస్కర్రెడ్డి, ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టుకు బాబా సాహెబ్ అంబేద్కర్పేరు, ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి జగ్జీవన్రాం పేరు, దుమ్ముగూడెం- నాగార్జునసాగర్ టెయిల్పాండ్కు జ్యోతిరావు పూలె పేరు, గాలేరు,నగరికి శ్రీకృష్ణదేవరాయలు పేరు, గార్కేల్కు పీవీ నర్సింహారావు పేరు పెట్టాలని క్యాబినెట్ నిర్ణయించింది.
Comments
Story first published: Saturday, November 29, 2008, 16:08 [IST]