కల్నల్ ఉన్నికృష్ణన్కు నివాళి
బెంగళూరు: ముంబై లో జరిగిన ఉగ్రవాదుల దాడుల్లో నేలకొరిగిన బెంగళూరు నివాసి కల్నల్ సందీప్ ఉన్నికృష్ణన్ భౌతిక కాయానికి శనివారం బెంగుళూరులో సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి. పెద్ద ఎత్తున రాజకీయనాయకులు, అధికారులు, బంధువులు, ప్రజలు ఉన్ని కృష్ణన్ నివాసానికి వచ్చి ఘనంగా నివాళులు అర్పించారు.ముఖ్యమంత్రి యెడ్యూరప్ప వచ్చి కృష్ణన్ భౌతిక కాయానికి నివాళులర్పించారు. సైనిక వందనం స్వీకరించిన ఉన్నికృష్ణన్ భౌతిక కాయం ఊరేగింపుగా బయలుదేరింది. అనంతరం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరుగుతాయి.ముంబై లో జరిగిన ఉగ్రవాదుల దాడుల్లో నేలకొరిగిన బెంగళూరు నివాసి కల్నల్ సందీప్ ఉన్నికృష్ణన్ మృతదేహం శుక్రవారం రాత్రి నగరానికి చేరుకొంది. స్థానిక ఇస్రో లే ఔట్లోని ఆయన నివాసానికి మృతదేహాన్ని తరలించారు. అక్కడ బందువుల రోదనలతో దృశ్యం హృదయవిదారకంగా కనిపించింది. హోంమత్రి,డీజీపీ మృతుని నివాసానికి వెళ్ళి ఘనంగా నివాళులర్పించారు.సాహసమే ఊపిరి అయిన సందీప్ ఉన్నికృష్ణన్ ఉన్నత విద్యాభ్యాసం పూర్తయిన అనంతరం సైన్యంలో చేరారు. గత ఏడాదే వివాహం జరిగింది. డిసెంబర్ 17న స్నేహితుని వివాహానికి బెంగళూరు వచ్చేందుకు టిక్కెట్ కూడా రిజర్వు చేసుకున్న ఆయన తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. దేశం కోసం తన బిడ్డ ప్రాణార్పణ చేసినందుకు ఎంతో గర్వంగా ఉందని ఉన్నికృష్ణన్ తండ్రి నాయర్ అన్నారు.