వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఐఎస్ఐ చీఫ్ రాడు: పాక్
ఇస్లామాబాద్: పాక్ ఇంటర్ సర్వీసెస్ ఇంటిలిజెంట్(ఐఎస్ఐ) చీఫ్ షాజా పాషా ఇండియా రావటంలేదు.ఈ విషయాన్ని గత అర్థరాత్రి అనంతరం పాక్ ప్రకటించింది. ముంబై పేలుళ్ల దర్యాప్తులో భారత్కు సహకరించేందుకు ప్రధాని మన్మోహన్సింగ్ సూచనమేరకు పాషాను పంపేందుకు పాక్ మొదట అంగీకారం తెలిపింది. ఈ మేరకు చర్చించేందుకు గత రాత్రి దేశాధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ, చీఫ్ ఆఫ్ ఆర్మీ జనరల్ పర్వేజ్ ఖయానీ, ప్రధాని యూసఫ్ రజా గిలానీలు సమావేశమయ్యారు. వీరి భేటీ రాత్రి 1.30 వరకు జరిగింది. అనంతరం వారు ఓ ప్రకటన చేశారు. ఐఎస్ఐ చీఫ్ పాషా బదులు ఐఎస్ఐ ప్రతినిధి ఒకరు భారత్ వెళతారని వారు ప్రకటించారు.
Comments
Story first published: Friday, December 5, 2008, 15:42 [IST]