వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
తాజ్ కి పూర్వ వైభవం కోసం టాటా
ముంబయి: తాజ్లో ఈరోజు ఉదయంతో తీవ్రవాదులతో పోరు ముగిసి సైన్యం ఆధీనంలోకి రావటంతో టాటా గ్రూప్ ఛైర్మన్, తాజ్ హోటల్ యజమాని రతన్టాటా మొదటిసారి హోటల్కు వచ్చారు. హోటల్లో తిరుగుతూ ఆయన జరిగిన నష్టాన్ని సమీక్షించారు. సైన్యాన్ని అడిగి వివరాలు తెలుసుకున్నారు. హోటల్కు తిరిగి పూర్వ వైభవాన్ని తెస్తామని, ఇందులోని ప్రతి అంగుళాన్ని ఎప్పటిలాగే పునర్నిర్మిస్తామని అన్నారు. ఇప్పటికే ఈ పని తాము చేస్తామని ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటేజ్ సంస్థ ముందుకు వచ్చింది. తమకు అందుకు తగిన అనుభవం ఉందని కూడా వారు టాటా గ్రూపునకు తెలిపారు. 105 ఏళ్ల ఈ సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించటం తమకు గర్వకారణమని వారు పేర్కొన్నారు.
Comments
Story first published: Friday, December 5, 2008, 15:45 [IST]