జర్దారీకి ఫోన్ చేయలేదు: ప్రణబ్
న్యూఢిల్లీ : పాక్ అధ్యక్షుడు జర్దారీకి తన పేరుతో వచ్చిన ఫోన్ కాల్ పాక్ ఆడుతున్న నాటకంగా కేంద్ర విదేశాంగ వ్యవహారాల శాఖమంత్రి ప్రణబ్ముఖర్జీ అభివర్ణించారు. కేవలం ఫోన్ కాల్ ద్వారానే యుద్ధానికి సన్నద్దమైన పాక్ తీరును ఆయన ఆదివారంనాడు దుయ్యబట్టారు. బెదిరింపు కాల్స్ పేరుతో ఉపఖండంలోని ప్రజలను మభ్యపెట్టేందుకు పాక్ పాలకులు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. తాను జర్దారీకి ఎలాంటి కాల్స్ చేయలేదని ఆయన స్పష్టం చేశారు. ప్రపంచ దేశాల దృష్టిని మళ్లించడానికే పాకిస్థాన్ ఈ నాటకం ఆడుతోందని ఆయన అన్నారు. ముంబయిలో పాక్ ఉగ్రవాదులు జరిపిన మారణకాండ దర్యాప్తును పక్క దోవ పట్టించేందుకే పాక్ ఇలాంటి కుటిల నాటకమాడుతోందని ఆయన ఘాటుగా విమర్శించారు.
జర్దారీకి
తప్పుడు
ఫోన్
కాల్
వచ్చినట్లు
డాన్
పత్రిక
రాసింది.
దీంతో
పాకిస్థాన్
వైమానిక
బలగాలను
అప్రమత్తం
చేసింది.
తప్పుడు
ఫోన్
కాల్
పై
కూడా
పొరుగుదేశం
పాకిస్థాన్
ప్రతిస్పందించడం
విచిత్రంగా
ఉందని
ప్రణబ్
ముఖర్జీ
అన్నారు.
జర్దారీకి
భారత్
నుంచి
ఫోన్
కాల్
వెళ్లలేదని,
మరో
దేశం
నుంచి
వెళ్లిందని
ఆయన
అన్నారు.