పోటీ చేయను, సినిమాల్లో నటిస్తా: పవన్
హైదరాబాద్: తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోనని, సినిమాల్లో నటిస్తానని ప్రజారాజ్యం పార్టీ యువజన విభాగం యువరాజ్యం సారథ్య బాధ్యతలు స్వీకరించిన పవన్ కళ్యాణ్ చెప్పారు. చిరంజీవి చేతుల మీదుగా ఆయన ఆదివారం యువరాజ్యం సారథ్యం బాధ్యతలు స్వీకరించారు. తాను మొదటి నుంచి తక్కువ సినిమాలు చేస్తున్నానని, అందువల్ల సినిమాలకు రాజకీయాలు అడ్డు రాబోవని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. సమాజానికి సేవ చేయాలనే లక్ష్యంతో వచ్చిన ప్రజారాజ్యం పార్టీలో పని చేయాలని తాను రాజకీయాల్లోకి వస్తున్నానని ఆయన చెప్పారు. ప్రజల కోసం నిజాయితీగా పని చేసే నాయకులు రావాలని మొదటి నుంచి అనుకుంటుండేవాడినని, ఆ నాయకులు ప్రజలకోసం ప్రాణ త్యాగం చేయడానికి కూడా సిద్ధంగా ఉండాలని, అటువంటి నాకుడు చిరంజీవి పార్టీ పెట్టారని, దాంతో తాను ఆ పార్టీలో పనిచేయాలని భావిస్తున్నానని ఆయన అన్నారు.
ఊహ తెలిసినప్పటి నుంచి తన కోసం తాను ఏమీ కోరుకోలేదని ఆయన చెప్పారు. నిస్సహాయులకు సామాజిక భద్రత కల్పించడమే తమ లక్ష్యమని ఆయన చెప్పారు. తనను రెండు సంఘటనలు తీవ్రంగా ప్రభావితం చేశాయని ఆయన చెప్పారు. చాలా చిన్నప్పుడు, ఏమీ తెలియని వయస్సులో మందుపాతర ఘటన వార్తల్లో వచ్చిందని, దాని గురించి చాలా మంది మాట్లాడుకుంటుండడం, భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేయడం గమనించానని, తాను పదో తరగతిలో ఉన్నప్పుడు పుస్తకం కొనుక్కోవడానికి వెళ్లి తిరిగి వస్తుండగా సైకిల్ కు డైనమో లేదని పోలీసులు స్టేషనులో పెట్టారని, అర్థరాత్రి ఒంటి గంట వరకు పోలీసు స్టేషనులో ఉండాల్సి వచ్చిందని, ఈ రెండు సంఘటనలు తనను తీవ్రంగా ప్రభావితం చేశాయని ఆయన వివరించారు.
తనను
చాలా
మంది
ప్రభావితం
చేశారని,
వారిలో
లోక్
నాయక్
జయప్రకాష్
నారాయణ్
తనకు
బాగా
నచ్చిన
నాయకుడని
ఆయన
చెప్పారు.
తనకు
బాగా
నచ్చింది
మానవతావాదమని
ఆయన
చెప్పారు.
ఉత్తమ
లక్ష్యాలతో
మానవతా
దృక్పథంతో
పని
చేయాడనికి
రాజకీయాల్లోకి
ఎవరైనా
వస్తారా
అని
ఎదురు
చూస్తూనే
ఉన్నానని,
అన్నయ్య
పార్టీ
పెట్టడంతో
తనకు
దారి
దొరికిందని
ఆయన
అన్నారు.
ప్రస్తుత
రాజకీయాల
పట్ల,
అవినీతి
పట్ల,
వ్యవస్థ
పట్ల
ప్రతి
ఒక్కరి
గుండె
రగిలిపోతూనే
ఉన్నదని,
చిరంజీవి
లాంటివారు
రాజకీయాల్లోకి
వస్తే
బాగుంటుందని
అటువంటివారు
అనుకుంటుండే
వారని
ఆయన
అన్నారు.