చిరుతో పొత్తు యత్నాలు లేవు: వెంకయ్య
హైదరాబాద్: ప్రజారాజ్యం అధినేత చిరంజీవితో తాము పొత్తు ప్రయత్నాలు ఏమీ చేయడం లేదని భారతీయ జనతా పార్టీ (బిజెపి) సీనియర్ నేత ఎం. వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. డిజెఎస్ అధ్యక్షుడిని రాజద్రోహం నేరం కింద అరెస్టు చేయాలని ఆయన ఆదివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. డిజెఎస్ ను నిషేధించాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. రాజకీయ పార్టీల ఓటు బ్యాంకు రాజకీయాల వల్లనే దేశంలో ఉగ్రవాదం పెరుగుతోందని ఆయన అన్నారు.
కాంగ్రెస్,
తెలుగుదేశం
పార్టీలు
మజ్లీస్
ను
పెంచి
పోషించాయని
ఆయన
విమర్శించారు.
మజ్లీస్
ఉగ్రవాదుల
కొమ్ము
కాస్తోందని
ఆయన
వ్యాఖ్యానించారు.
మజ్లీస్
చట్టానికి
అతీతమైందా,
ప్రభుత్వం
ఆ
పార్టీని
ఎందుకు
ప్రోత్సహిస్తోందని
ఆయన
అన్నారు.
మజ్లీస్
రాజకీయ
పార్టీ
కాదని,
మత
ఛాందస
సంస్థ
అని
ఆయన
అన్నారు.
ఎన్నికల
తర్వాత
కాంగ్రెసుతో
కలవబోమని
కమ్యూనిస్టు
పార్టీలు
చెప్పగలవా
అని
ఆయన
ప్రశ్నించారు.
కమ్యూనిస్టు
పార్టీలపై
ఆయన
తీవ్ర
వ్యాఖ్యలు
చేశారు.