వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దేవేందర్ తో చిరు పొత్తు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ : ప్రజారాజ్యం అధినేత చిరంజీవితో నవ తెలంగాణ పార్టీ అధ్యక్షుడు దేవేందర్‌గౌడ్‌ ఆదివారం చర్చలు జరిపారు. ప్రభుత్వంపై సంయుక్తంగా ఉద్యమించాలని ఉభయపక్షాలు నిర్ణయించాయి. ఇరు పార్టీల మధ్య పొత్తు ఖరారైనట్లు ప్రచారం జరుగుతోంది. పొత్తులపైనే వీరిరువురి మధ్య చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ఒక వైపు తమతో చర్చలు జరుపుతూనే మరో వైపు తెలుగుదేశం పార్టీ వైపు చూస్తుండడంతో చిరంజీవి నవ తెలంగాణతో పొత్తును ఖరారు చేసుకున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో దేవేందర్ నాయకత్వంలోని ఎన్టీపికి తగిన సీట్లు ఇవ్వడానికి చిరంజీవి అంగీకరించినట్లు చెబుతున్నారు.

కాగా, తాము స్నేహపూర్వకంగానే కలిశామని దేవేందర్ గౌడ్ మీడియా ప్రతినిధులతో చెప్పారు. పొత్తులపై చర్చించలేదని చిరంజీవి చెప్పారు. తెరాసకు ఇంకా తలువులు తెరిచే ఉన్నాయని ఆయన అన్నారు. తమతో తెరాస నాయకుడు కె. చంద్రశేఖరరావు కలిసి వస్తే తమకు అభ్యంతరం లేదని దేవేందర్ గౌడ్ చెప్పారు. ప్రజా సమస్యలపై ఉమ్మడి పోరాటం చేయనున్నట్లు చిరంజీవి, దేవేందర్ గౌడ్ చెప్పారు. పొత్తులు, సీట్ల సర్దుబాటుపై తొందర లేదని దేవేందర్ గౌడ్ అన్నారు. తెలంగాణపై చిరంజీవికి స్పష్టత ఉందని ఆయన అన్నారు. ఈ భేటీలో యువరాజ్యం నాయకుడు పవన్ కళ్యాణ్, ఎన్టీపి నాయకుడు ఇ. పెద్దిరెడ్డి కూడా పాల్గొన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X