వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాధాపై నా ఒత్తిడి లేదు: పవన్

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడు వంగవీటి రాధాకృష్ణ ప్రజారాజ్యం పార్టీలోకి రావడంలో తన ఒత్తిడి ఏమీ లేదని యువరాజ్యం అధినేత పవన్ కళ్యాణ్ చెప్పారు. తాను, వంగవీటి రాధాకృష్ణ సన్నిహిత మిత్రులమని ఆయన ఆదివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. వంగవీటి రాధాకృష్ణకు ఎంతో చేయాలనే తపన ఉందని, ప్రజలకు అనుకున్నంత సేవ చేయలేకపోతున్నానని బాధపడుతూ ఉండేవారని ఆయన చెప్పారు. తాను బహుశా ఈ నెల 26వ తేదీ నుంచి రాష్ట్ర పర్యటనను ప్రారంభిస్తానని, కొండగట్టు నుంచి తన యాత్రను ప్రారంభించాలని అనుకుంటున్నానని ఆయన చెప్పారు. అయితే తన పర్యటన ఇంకా పూర్తిగా ఖరారు కాలేదని ఆయన చెప్పారు.

శ్రవణ్ ను యువరాజ్యం ప్రధాన కార్యదర్శిగా నియమించినట్లు ఆయన తెలిపారు. మరికొన్ని నియామకాలను కూడా ఆయన ప్రకటించారు. రెండో నియమాకాలు త్వరలో జరుగుతాయని ఆయన చెప్పారు. సత్యం కంప్యూటర్స్ లో ఉద్యోగానికి రాజీనామా చేసి శ్రవణ్ యువరాజ్యంలోకి వచ్చారని ఆయన అన్నారు. ఇంత వరకు ప్రజసేవ చేయాలనే తపన ఉన్నవారికి రాజకీయాల్లో చోటు ఉండేది కాదని, ప్రజారాజ్యంతో ఆ లోటు భర్తీ అవుతోందని ఆయన అన్నారు. తాను యువకులను, విద్యార్థులను ఎంతో మంది కలుసున్నట్లు ఆయన తెలిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X