వంగవీటి రంగా రియల్ హీరో: చిరు
హైదరాబాద్ : వంగవీటి రంగా రాజకీయాల్లో రియల్హీరో అని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి అన్నారు. రంగా కుమారుడు రాధా తమ పార్టీలోకి రావడం శుభపరిణామమని ఆయన చెప్పారు. విజయవాడ తూర్పు నియోజకవర్గ శాసనసభ్యుడు, కాంగ్రెస్ నాయకుడు వంగవీటి రాధాకృష్ణ ప్రజారాజ్యంలో చేరారు. ప్రజారాజ్యం అధినేత చిరంజీవి సమక్షంలో ఆయన ప్రజారాజ్యం తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడారు. రంగా ఆయన సాధన కోసమే రాధ తమ పార్టీలో చేరారని ఆయన చెప్పారు. తనను రాజకీయాల్లోకి రావాలని రంగా అడుగుతుండేవారని ఆయన గుర్తు చేసకున్నారు.
కాంగ్రెస్
పార్టీ
కోసం
తన
తండ్రి
వంగవీటి
రంగా
ప్రాణత్యాగం
చేసినప్పటికి
తనకు
పార్టీలో
సరైన
గుర్తింపు
రాలేదని
ప్రజారాజ్యంలో
చేరిన
వంగవీటి
రాధాకృష్ణ
పేర్కొన్నారు.
తాను
చిరంజీవి
అభిమానిని
అని,
తనకు
చిరంజీవి
రాజకీయ
సిద్ధాంతాలు
నచ్చాయని,
అందుకే
తాను
ప్రజారాజ్యంలో
చేరుతున్నానని
రాధ
చెప్పారు.
రాధాకృష్ణ
ప్రజారాజ్యం
పార్టీలో
చేరినట్లు
తనకు
తెలియదని
ముఖ్యమంత్రి
డాక్టర్
వైయస్
రాజశేఖర
రెడ్డి
వ్యాఖ్యానించారు.
చిరంజీవి
పార్టీలో
రాధాకృష్ణ
చేరుతారని
చాలా
కాలంగా
ప్రచారం
జరుగుతోంది.