వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
తిరిగి తెరుచుకున్న ట్రైడెంట్ హోటల్
ముంబయి: నవంబరు 26న జరిగిన ఉగ్రవాద దాడుల్లో దెబ్బతిన్న ట్రైడెంట్ హోటల్ మళ్లీ అతిథుల కోసం ముస్తాబైంది. ఆదివారం నుంచి హోటల్ను పునఃప్రారంభిస్తున్నట్లు ఒబెరాయ్ గ్రూప్ ప్రకటించింది. అతిథుల రక్షణకు పటిష్ఠ చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. హోటల్ ప్రారంభోత్సవానికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ చవాన్, ఉప ముఖ్యమంత్రి ఛగన్ భుజ్బల్ హాజరయ్యారు.
అలాగే
ఉగ్రవాద
దాడులకు
గురైన
తాజ్
టవర్
హోటల్ను
కూడా
ఆదివారం
ప్రారంభిస్తున్నారు.
సాయంత్రం
ఏడు
గంటలకు
హోటల్లో
ప్రారంభోత్సవాలు
నిర్వహిస్తున్నట్లు,
తాజ్
ప్యాలెస్
మాత్రం
మరో
మూడు
నెలల
తర్వాత
ప్రారంభిస్తామని
ఇండియా
హోటల్స్
గ్రూపు
ప్రకటించింది.
పాకిస్థాన్
నుంచి
వచ్చే
వారికి
హోటల్లోకి
ప్రవేశం
ఉండదని
చెబుతున్నారు.
Comments
Story first published: Monday, December 22, 2008, 9:59 [IST]