తెరాస అసమ్మతి ఎమ్మెల్యేల రాజీనామా
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రసమితి అసమ్మతి శాసనసభ్యులు ముకుందరెడ్డి, సంతోష్రెడ్డి, కాసిపేట లింగయ్య , సారారాణి తమ పదవులకు రాజీనామాలు చేశారు. వీరు సభాపతి సురేష్రెడ్డికి తమ రాజీనామా పత్రాలను ఆదివారంనాడు సమర్పించారు. నారాయణరావుపటేల్ మాత్రం తమ రాజీనామాలను ఫ్యాక్స్లో పంపుతున్నట్టు తెలిపారు. దుగ్యాల శ్రీనివాసరావు తన మనిషితో రాజీనామా లేఖను పంపుతున్నట్లు తెలిపారని స్పీకర్ కె.ఆర్. సురేష్ రెడ్డి చెప్పారు. మరో నలుగురు తెరాస అసమ్మతి శాసనభ్యులు రేపు (సోమవారం) రాజీనామాలు చేసే అవకాశం ఉంది.
తాను,
ముకుందరెడ్డి
కాంగ్రెసు
పార్టీలో
చేరుతున్నట్లు
సంతోష్
రెడ్డి
చెప్పారు.
తెరాస
అధ్యక్షుడు
కె.
చంద్రశేఖరరావు
తెలంగాణ
అంశాన్ని
గందరగోళపరుస్తున్నారని
ఆయన
విమర్శించారు.
తమ
వ్యవహారంపై
ముఖ్యమంత్రి
మీది
విమర్శలు
వస్తున్నాయని,
అందుకే
తాము
నేరుగా
కాంగ్రసులో
చేరాలని
నిర్ణయించుకున్నామని
ఆయన
చెప్పారు.
వీరి
రాజీనామా
వ్యవహారంపై,
వీరి
అనర్హత
పిటిషన్
పై
రేపు
నిర్ణయం
తీసుకుంటామని
స్పీకర్
చెప్పారు.
తొమ్మిది
మంది
తెరాస
శాసనసభ్యులు
పార్టీ
విప్
ను
ధిక్కరించి
ఎమ్మెల్సీ
ఎన్నికల్లో
మన
పార్టీ
నాయకుడు
కాసాని
జ్ఞానేశ్వర్
కు
ఓటు
వేసిన
విషయం
తెలిసిందే.
వారిని
అనర్హులుగా
ప్రకటించాలని
తెరాస
స్పీకర్
ను
కోరుతూ
పిటిషన్
వేసింది.