వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మొద్దుశీను భార్యకు రూ.5 లక్షలు
గుంటూరు: అనంతపురం సబ్ జైలులో మృతి చెందిన మొద్దు శీను భార్య లక్ష్మీరాజ్యంకు రూ.5లక్షలు అందజేయాలని జిల్లా కలెక్టర్ బి వెంకటేశంకు శనివారం రాత్రి ఆదేశాలు అందాయి. మానవ హక్కుల సంఘం శ్రీను భార్యకు రూ.5లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. మొద్దు శీను పరిటాల హత్యకేసులో ప్రధాన నిందితుల్లో ఒకడు. మరో ప్రధాన నిందితుడు మద్దల చెరువు సూరికి సన్నిహితుడు.
ఈమేరకు జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్, గుంటూరు జిల్లా కలెక్టర్కు రూ.5లక్షలు పంపాలని శనివారం ప్రభుత్వం ఆదేశాలు జారీ చేశారు. మొద్దు శ్రీను భార్య లక్ష్మీరాజ్యంకు రూ.5లక్షలు వెంటనే చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం కలెక్టరేట్కు ఫ్యాక్స్ ద్వారా శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. వారం రోజులలో ఈ మొత్తాన్ని లక్ష్మీరాజ్యంకు అందజేస్తామని అధికారులు తెలిపారు.
Comments
Story first published: Sunday, December 28, 2008, 16:46 [IST]