వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ధోనీకి బెదిరింపు లేఖ, భద్రత పెంపు
దావూద్ ఇబ్రహీం గ్యాంగ్ సభ్యుడినని చెప్పుకుంటూ ఒక వ్యక్తి ఈ లేఖను తెచ్చి, ధోనీ కుటుంబ సభ్యులకు అందజేసినట్టు సమాచారం. అయితే ఆ లేఖ ఎంతో దూరం నుంచి రాలేదని ధోనీ నివాస ప్రాంతానికి అతి సమీపంలో ఉన్న కాలనీ నుంచి వచ్చిందని పోలీసులు చెబుతున్నారు. "స్ధానిక నేరస్ధులే" ఆ లేఖను పంపించి ఉండవచ్చని పోలీసులు అంటున్నారు.
అండర్ వరల్డ్ మాఫియా హస్తం గురించి ఎటువంటి ఆధారాలు లేవని జార్ఖండ్ పోలీసు ఇన్ స్పెక్టర్ జనరల్ ఎ ఎన్ ప్రధాన్ చెప్పారు. ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని, ఈ సమస్య త్వరలో పరిష్కారమవుతుందని ఆయన తెలిపారు. ధోనీకి ఇప్పటికే జెడ్ క్యాటగిరీతో సమానమైన సెక్యూరిటీ ఉందని, ఈ బెదిరింపు లేఖ పర్యవసానంగా ఇంకా అదనపు పోలీసు బలగాలను ఇచ్చామని పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు.
Comments
Story first published: Wednesday, December 31, 2008, 12:29 [IST]