వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ధోనీకి బెదిరింపు లేఖ, భద్రత పెంపు

By Staff
|
Google Oneindia TeluguNews

Mahendra Singh Dhoni
రాంచి: భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి బెదిరింపు లేఖ అందింది. తక్షణం యాభై లక్షల రూపాయలు చెల్లించకపోతే కుటుంబ సభ్యుల అంతు చూస్తామన్నది ఆ లేఖ సారాంశం. ఈ లేఖ పర్యవసానంగా ధోనీకి, ఆయన కుటుంబసభ్యులకు సెక్యూరిటీని పెంచినట్టు పోలీసు అధికారులు బుధవారం ఉదయమే ప్రకటించారు.

దావూద్ ఇబ్రహీం గ్యాంగ్ సభ్యుడినని చెప్పుకుంటూ ఒక వ్యక్తి ఈ లేఖను తెచ్చి, ధోనీ కుటుంబ సభ్యులకు అందజేసినట్టు సమాచారం. అయితే ఆ లేఖ ఎంతో దూరం నుంచి రాలేదని ధోనీ నివాస ప్రాంతానికి అతి సమీపంలో ఉన్న కాలనీ నుంచి వచ్చిందని పోలీసులు చెబుతున్నారు. "స్ధానిక నేరస్ధులే" ఆ లేఖను పంపించి ఉండవచ్చని పోలీసులు అంటున్నారు.

అండర్ వరల్డ్ మాఫియా హస్తం గురించి ఎటువంటి ఆధారాలు లేవని జార్ఖండ్ పోలీసు ఇన్ స్పెక్టర్ జనరల్ ఎ ఎన్ ప్రధాన్ చెప్పారు. ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని, ఈ సమస్య త్వరలో పరిష్కారమవుతుందని ఆయన తెలిపారు. ధోనీకి ఇప్పటికే జెడ్ క్యాటగిరీతో సమానమైన సెక్యూరిటీ ఉందని, ఈ బెదిరింపు లేఖ పర్యవసానంగా ఇంకా అదనపు పోలీసు బలగాలను ఇచ్చామని పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X