హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రక్తం అమ్ముతున్నామా?అల్లు అరవింద్

By Staff
|
Google Oneindia TeluguNews

Allu Aravind
హైదరాబాద్:చిరంజీవి బ్లెడ్‌ బ్యాంక్‌ పేరుతో రక్తం వ్యాపారం చేస్తున్నారన్నదానికి ప్రజారాజ్యం పార్టీ ప్రధాన కార్యదర్శి అల్లు అరవింద్‌ ఘాటుగా స్పందించారు.అలాగే మా బ్లడ్ బ్యాంక్ ద్వారా ఎవరికి ఉచితంగా రక్తం అందలేదో చూపమని సవాల్ విసిరారు. తనపై కావాలనే బురదజల్లుతున్నారని ఆయన అన్నారు. తమ తమ స్వీయ రాజకీయ ప్రయోజనాల కోసమే ప్రజా సేవ చేస్తున్న తమని విమర్శిస్తున్నారని ఆయన అన్నారు. హైదరాబాద్‌ రావి నారాయణరెడ్డి ఆడిటోరియంలో జరిగిన నెల్లూరు, గుంటూరు, మహబూబ్‌నగర్‌, ప్రకాశం జిల్లాలో బీసీ నాయకుల సదస్సులో అరవింద్ పాల్గొన్నారు. సిరిసిల్ల చేనేత కార్మికుల ఆత్మహత్యలు చిరంజీవి పర్యటించేవరకూ ప్రభుత్వానికి కనిపించలేదని ఆరోపించారు. ఫిబ్రవరిలో పది లక్షల మంది బీసీలతో బీసీల ఆత్మగౌరవ సభ నిర్వహిస్తామని ఆయన ప్రకటించారు. వెనుకబడిన కులాల వారిని గుర్తించి వారికి పార్టీలో సముచిత స్థానం కల్పించింది ప్రజారాజ్యం పార్టీయేనని చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X