వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రామెజీరావు పై అట్రాసిటీ కేసు!

By Staff
|
Google Oneindia TeluguNews

Ramoji Rao
సత్తెనపల్లి : ఎస్టీకులానికి చెందిన తనపై కారంపూడి ఈనాడు విలేఖరి పత్రి సురేష్‌ అగ్రకుల దురహంకారంతో తప్పుడు వార్తలు పంపగా... ఈనాడు ఎడిటర్‌ రామోజీరావు ఆ వార్తలను గుంటూరు జిల్లా ఎడిషన్‌లో వార్తలు ప్రచురించారని జగన్నాధం పార్ధసారధి అనే వ్యక్తి ఆరోపిస్తూ ఫిర్యాదు చేసారు. దీనివల్ల తన పరువుకు నష్టం జరిగిందని పార్ధసారధి ఫిర్యాదులో పేర్కొన్నారు. వారిపై ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేయాలని కోర్టులో ప్రైవేట్‌ ఫిర్యాదు దాఖలు చేశారు.

దాంతో ఈనాడు దినపత్రిక చీఫ్‌ ఎడిటర్‌ రామోజీరావుపై దాఖలైన పరువునష్టం, ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ ఫిర్యాదును విచారించి, కేసు నమోదు చేయాలని సత్తెనపల్లి పట్టణ ఒకటవ అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి సాధుబాబు పట్టణ డీఎస్‌పీకి ఆదేశాలు జారీ చేశారు. ఆయనతో పాటు కారంపూడి ఈనాడు దినపత్రిక విలేఖరి పత్రి సురేష్‌లపైనా ఇదే ప్రక్రియ చేపట్టాలని ఆదేశించారు. జగన్నాధం పార్ధసారధి సత్తెనపల్లిలోని రఘురామ్‌నగర్‌లో నివసిస్తున్నారు. కారంపూడి తహసిల్దారుగా పనిచేస్తూ డిసెంబరు 21న పార్ధసారధి సస్పెన్షన్‌కు గురయ్యారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X