వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాష్ట్రానికి పెద్దకొడుకుగా మారతా:చిరంజీవి

By Staff
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
నెల్లూరు: ఇప్పటివరకు కుటుంబపెద్దగా తన కుటుంబాన్నే చక్కదిద్దుకున్నానని, ఇకపై ఆంధ్రప్రదేశ్‌ అనే పెద్ద కుటుంబానికి పెద్దకొడుకుగా మారి సేవ చేస్తానని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి చెప్పారు.'ఇదే నా తల్లి కోరిక' అని పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం కుటుంబ సంక్షేమాన్ని విస్మరించిన వ్యసనపరుడైన తండ్రి పాత్రను పోషిస్తోందని, ప్రజాసంక్షేమాన్ని వదలి తన సంక్షేమం చూసుకుంటోందని చిరంజీవి దుయ్యబట్టారు. శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో కొనసాగుతున్న ప్రజాఅంకిత యాత్ర మూడోరోజున ఆయన కోవూరు, బుచ్చి, ఆత్మకూరు, వింజమూరు, కావలి సభల్లో మాట్లాడారు.

సోమవారం రాత్రి నెల్లూరులో బస చేసిన చిరంజీవి.. మంగళవారం కోవూరు సభతో మూడోరోజు యాత్రను ప్రారంభించారు. ఆయా సభల్లో ఆయన మాట్లాడుతూ.. అసెంబ్లీలో నువ్వు రూ.10 కోట్లు తిన్నావంటే.. నువ్వు రూ.100 కోట్లు తిన్నావని తిట్టుకునే రాజకీయ నాయకులు.. తాము ప్రజల సొమ్ము తినలేదని మాత్రం అనడంలేదు. నేటి రాజకీయాలు నికృష్టంగా మారాయి. ఇలాంటి రాజకీయాల్లో మార్పు తీసుకొచ్చేందుకే ప్రజారాజ్యం వస్తోంది. ఒక్క ఛాన్స్‌ ఇవ్వడానికి మీరు సిద్ధంగా ఉన్నారు. దాన్ని సద్వినియోగం చేసుకొని మీ జీవితాల్లో ఇప్పుడు కనిపిస్తున్న సంతోషాన్ని శాశ్వతం చేసేందుకు నేను సిద్ధంగా ఉన్నాను.. అని చిరంజీవి ప్రజలకు వాగ్దానం చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X