వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సత్యం-మేటాస్‌ పై విచారణ:వైఎస్‌

By Staff
|
Google Oneindia TeluguNews

YS Rajasekhar Reddy
న్యూఢిల్లీ :సత్యం-మేటాస్‌ ఆస్థులతో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి వెల్లడించారు. సత్యం వ్యవస్థాపకుడైన రామలింగరాజు కుమారునికి చెందిన మేటాస్‌ కంపెనీ,ప్రభుత్వాని కి ఎదురు చెల్లించి మరీ మెట్రో ప్రాజెక్టును దక్కించుకున్నది. అయితే సత్యం కంపెనీ వివాదాల్లో చిక్కుకున్న నేపథ్యంలో ఇప్పుడు మేటాస్‌ కంపెనీ సామర్థ్యంపై కూడా సందేహాలు తలెత్తాయి.దీనితో వైఎస్‌ ఆ కంపెనీపై విచారణకు ఆదేశించారు.

మేటాస్‌ ప్రాపర్టీస్‌కు భారీ ప్రాజెక్టులు కేటాయించినందున వాటిపై ఏమేరకు ప్రభావం పడుతుందో పరిశీలిస్తున్నామని తెలిపారు. షేరు హోల్డర్ల తరపున క్రిమినల్‌ కేసు పెట్టేందుకు అవకాశాలున్నాయా అనే కోణంలో పరిశీలిస్తున్నామని చెప్పారు. మేటాస్‌ ప్రాపర్టీస్‌ చేపట్టిన ప్రాజెక్టుల పనితీరుపై అంచనా వేయాలని,పరిస్థితులు పరిశీలించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించామని చెప్పారు. సత్యం కంప్యూటర్స్‌ పరిణామాలు దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయని తెలిపారు. రామలింగరాజు చెప్పిన మాటల్లోనే అక్కడ ఏమి జరుగుతుందో వెల్లడవుతోందని చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X