2 నెలలు జీతాల్లేవు: సత్యం ఈమెయిల్
హైదరాబాద్: రెండు నెలల పాటు జీతాలు ఇవ్వలేమని సత్యం కంప్యూటర్స్ యాజమాన్యం తన 53 వేల మంది సిబ్బందికి ఈ-మెయిల్ పంపింది. ఇప్పటికే భయభ్రాంతులైన సిబ్బందికి ఇది అశనిపాతంలా తగిలింది. పదివేల మందిని తొలగించాలని యాజమాన్యం నిర్ణయించినా, ఈ రెండు నెలల జీతం కట్ దెబ్బకు చాలామంది సంస్ధను స్వచ్చందంగా వీడిపోయే అవకాశముంది.
మాదాపూర్ లోని సత్యం కార్యాలయంలో సెబి అధికారులు రామలింగరాజు తరఫు న్యాయవాది భరత్ కుమార్ ను విచారిస్తున్నారు. తన ఆరోగ్యం బాగుండలేదని రాజు చెప్పడం వల్ల ఈ న్యాయవాది రంగంలోకి వచ్చారు. రామలింగరాజు ఎక్కడ ఉన్నదీ చెప్పడానికి ఆయన న్యాయవాది మీడియా ముందు నిరాకరించారు.
Comments
Story first published: Friday, January 9, 2009, 16:50 [IST]