ఎన్టీఆర్ వర్థంతికి అక్కినేని దూరం
తన కుమారుడు ప్రభుత్వ పథకాలకు ప్రచారం చేస్తుండటం, మారిన పరిస్థితుల కారణంగానే ఏఎన్నార్ వెళ్లలేదని ప్రచారం జరుగుతోంది. అక్కినేని ఈ విషయాన్ని కొట్టిపారేశారు. అనారోగ్యం కారణంగానే వెళ్లలేదని 'ఆన్లైన్'తో తెలిపారు. అధికారంలో ఉన్న వాళ్ళు మంచి చేసినా, చెడు చేసినా చెప్పడానికి తనతో పాటు కుటుంబసభ్యులెవరూ వెనుకాడరని చెప్పారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా కాంగ్రెస్కన్నా బాగాచేశారని తాను చెప్పానని, వైఎస్ బాగా చేస్తున్నారు కాబట్టి నాగార్జున ప్రచారం చేస్తున్నారని వివరించారు. ఎన్టీఆర్ మహానటుడని పొగిడారు.
Story first published: Monday, January 19, 2009, 11:11 [IST]