హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వేల కోట్లు దారిమళ్ళింపు: ప్రాసిక్యూటర్

By Staff
|
Google Oneindia TeluguNews

Ramalinga Raju
హైదరాబాద్: సత్యం మాజీ చైర్మన్ రామలింగరాజు అక్రమాలను పబ్లిక్ ప్రాసిక్యూటర్ నాంపల్లి కోర్టులో వినిపించారు. సత్యం కంపెనీలో 53 వేల మంది ఉద్యోగులు లేరని, 40 వేల మంది మాత్రమే ఉన్నారని పిపి వాదించారు. బషీర్ బాగ్ లోని హెచ్ డిఎఫ్ సి బ్యాంక్ లో డిపాజిట్లు ఉన్నాయని బ్యాలెన్స్ షీట్ లో అసత్యం చెప్పారని ఆయన కోర్టుకు విన్నవించారు.

సత్యం రాజు నెలకు 20 కోట్ల రూపాయలు బోగస్ ఉద్యోగుల పేరుతో తల్లి, సోదరుల ఖాతాలకు జీతాలను మళ్ళించారని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించారు. సోమాజిగుడాలోని గుల్ రేజ్ అపార్ట్ మెంట్ లోని 507 రామలింగరాజు సీక్రెట్ డెన్ అని, ఆయన చేసిన అక్రమాలకు సంబంధించిన పత్రాలు అక్కడ లభ్యమయ్యాయని పిపి తెలియజేశారు. దారి మళ్ళించిన వేలాది కోట్ల రూపాయలతో రామలింగరాజు వేలాది ఎకరాలను బినామీ పేర్లతో కొనుగోలు చేశారని ఆయన వాదించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X