రాజుకు బెయిలా? జెయిలా?
హైదరాబాద్: సత్యం మాజీ చైర్మన్ రామలింగరాజు బెయిలు పిటీషన్పైఈరోజు నాంపల్లి కోర్టులో విచారణ జరగనుంది. దీంతోపాటే సెబి దాఖలు చేసిన పిటీషన్పై కూడా నేడు విచారణ జరగనుంది. ఈరోజు సాయంత్రం నాలుగున్నర వరకు రామలింగరాజు సోదరులకు సీఐడి కస్టడీ ఉంది. ఆలోగా బెయిలు సంగతి తేలే అవకాశం ఉంది.
సత్యం కంప్యూటర్స్ లో అక్రమాలకు సంబంధించి రామలింగరాజు, రామరాజు, వడ్లమాని శ్రీనివాస్ ల వాంగ్మూలాలను నమోదు చేసుకునేందుకు అనుమతించాలని కోరుతూ సెక్యూరిటీస్ అండ్ ఎక్చేంజెస్ బోర్డ్ ఆఫ ఇండియా దాఖలు చేసిన పిటిషన్ పై నేడు ఆరో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఉత్తర్వులు జారీ చేసే అవకాశాలున్నాయి. ఈ సాయంత్రం రామలింగరాజు, శ్రీనివాస్ ల సిఐడి కస్టడీ ముగిసిన వెంటనే వారిని మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచవలసి ఉంది.
Comments
Story first published: Friday, January 23, 2009, 11:13 [IST]