కాళహస్తిలో భక్తుల కిటకిట
హైదరాబాద్: సూర్యగ్రహణం సందర్భంగా ఈరోజు రాష్ట్రంలో ఆలయాలన్నీ మూతపడ్డాయి. ఉదయం 8 గంటలకు ఆలయాలన్నిటిని మూసివేశారు. తిరుమల, విజయవాడ కనకదుర్గ, అన్నవరం, శ్రీశైలం తదితర ప్రముఖ దేవాలయాలన్నీ మూతబడ్డాయి.
తిరిగి సాయంత్రం 5 గంటలకు గ్రహణం అనంతరం సంప్రోక్షణ నిర్వహించి తెరుస్తారు. ఒక్క కాళహస్తి ఆలయం మాత్రమే ఈరోజు తెరిచి ఉంచారు. దీంతో అక్కడ భక్తులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. ఉదయానికే 20 వేలమంది దర్శనాలు చేసుకోవటంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది.
Comments
Story first published: Wednesday, January 28, 2009, 13:43 [IST]