రోడ్డు ప్రమాదం: 15 మంది మృతి
చెన్నై: తమిళనాడులోని తిరునల్వేలి వద్ద జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో 15 మంది మృతి చెందారు. శంకర్ నగర్ సమీపంలో ఈరోజు తెల్లవారుజామున రెండు వ్యాన్లు ఢీకొనటంతో ఈ దుర్ఘటన సంభవించింది. కుంభకోణం వెళ్లి దైవదర్శనం చేసుకుని వస్తుండగా ఓ వ్యాను పాలవ్యానును ఢీకొంది. దీంతో వ్యానులో ప్రయాణిస్తున్న 19 మంది ప్రయాణీకుల్లో 13 మంది అక్కడికక్కడే మృతి చెందగా ఇద్దరు ఆసుపత్రిలో మృతి చెందారు.
Story first published: Tuesday, January 27, 2009, 15:12 [IST]