హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

'సత్యం' స్కాంలో వైఎస్ సర్కార్: లెఫ్ట్

By Staff
|
Google Oneindia TeluguNews

BV Raghavulu
హైదరాబాద్: సత్యం కంప్యూటర్స్ సంస్ధ కుంభకోణానికి ప్రభుత్వమే కారణమని వామపక్షాలు ఆరోపించాయి. మేటాస్‌ భూ కొనుగోళ్లపై తాము చెప్పినప్పుడు ప్రభుత్వం స్పందించి ఉంటే సత్యం నిధులు దారి మళ్లేవి కాదని సీపీఎం, సీపీఐ నేతలు అన్నారు. మేటాస్‌ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోకపోతే తామే వాటిని పేదలకు పంచుతామని అన్నారు. మేటాస్‌ భూముల్లో జెండాలు పాతేందుకు సీపీఐ కార్యదర్శి నారాయణ, సీపీఎం కార్యదర్శి రాఘవులు రంగారెడ్డి జిల్లా మంచాల మండలానికి ఈరోజు బయలుదేరి వెళ్లారు.

కాగా సత్యం రామలింగరాజు తమ పాలిట్ దేవుడంటూ మండలంలోని కొన్ని గ్రామాల్లో బ్యాకర్లు కన్పించడంతో లెఫ్ట్ నేతలు కంగుతిన్నారు. వామపక్ష నేతలు నారాయణ, రాఘవులు రాక్షసులని కూడా బ్యానర్లు వెలిశాయి. రామలింగరాజుకు బ్రోకర్ గా వ్యవహరించిన టీచర్ ఆకుల రాజయ్యే ఈ బ్యానర్లు కట్టించి ఉంటారని స్ధానిక లెఫ్ట్ నాయకులు అనుమానిస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X