ఇళ్ల మధ్యకు వచ్చిన గూడ్స్ రైలు
హైదరాబాద్: పట్టాలమీద నడవాల్సిన రైలు ఇళ్ల మధ్యకు రావటంతో ప్రజలు బెంబేలెత్తి పరుగులు తీశారు. ఏం జరుగుతుందో తెలియని గందరగోళం అక్కడ నెలకొంది. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ సమీపంలోని మల్కాజిగిరి ప్రాంతంలో సోమవారం ఉదయం ఈ సంఘటన జరిగింది. నిజామాబాద్నుంచి తమిళనాడుకు రెండు ఇంజిన్లు, 5 వేగన్లతో బయలుదేరిన గూడ్సురైలు హైదరాబాద్ శివార్లలోని మల్కాజిగిరి వద్ద పట్టాలు తప్పింది.
రైలింజను, రెండు బోగీలు పట్టాలు తప్పాయి.నివాసగృహాలు అక్కడే ఉండటం, రైలు ఇంజిన్ ఓ ఇంటి ప్రహరీ గోడను ఢీకొట్టటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఏం జరుగుతుందో అర్థంకాలేదు. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రమాదం జరగలేదని హైదరాబాద్ డీఆర్ఎం నరోత్తన్దాస్ తెలిపారు.
Comments
Story first published: Monday, February 2, 2009, 15:46 [IST]