నిజామాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఇళ్ల మధ్యకు వచ్చిన గూడ్స్ రైలు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: పట్టాలమీద నడవాల్సిన రైలు ఇళ్ల మధ్యకు రావటంతో ప్రజలు బెంబేలెత్తి పరుగులు తీశారు. ఏం జరుగుతుందో తెలియని గందరగోళం అక్కడ నెలకొంది. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ సమీపంలోని మల్కాజిగిరి ప్రాంతంలో సోమవారం ఉదయం ఈ సంఘటన జరిగింది. నిజామాబాద్‌నుంచి తమిళనాడుకు రెండు ఇంజిన్లు, 5 వేగన్లతో బయలుదేరిన గూడ్సురైలు హైదరాబాద్‌ శివార్లలోని మల్కాజిగిరి వద్ద పట్టాలు తప్పింది.

రైలింజను, రెండు బోగీలు పట్టాలు తప్పాయి.నివాసగృహాలు అక్కడే ఉండటం, రైలు ఇంజిన్‌ ఓ ఇంటి ప్రహరీ గోడను ఢీకొట్టటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఏం జరుగుతుందో అర్థంకాలేదు. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రమాదం జరగలేదని హైదరాబాద్‌ డీఆర్‌ఎం నరోత్తన్‌దాస్‌ తెలిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X