భారత్ కు ఆల్ ఖైదా హెచ్చరిక
న్యూఢిల్లీ: పాక్పై దుష్ప్రచారానికి, దాడికి పాల్పడినా సహించేది లేదని తీవ్రవాద సంస్థ అల్ ఖైదా భారత్ను హెచ్చరించింది. అఫ్గనిస్థాన్లో అల్ఖైదా మిలిటరీ కమాండర్గా ఉన్న ముస్తఫా అబూ యాజిద్ ఈ హెచ్చరిక చేశారు. ముంబయి పేలుళ్ల అనంతరం భారత్ నిస్పృహకు గురై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతోందని, పాక్ వ్యతిరేక ప్రచారాన్ని మానకపోయినా, పాక్పై దాడికి యత్నించినా ముంబయి ఘటనలకు మించిన దాడులను ఆ దేశం ఎదుర్కొనవలసి ఉంటుందని హెచ్చరించింది. బిబిసికి పంపిన 20 నిమిషాల వీడియోలో ఆయన భారత్ కు హెచ్చరిక చేశారు.
ముజాహిదీన్ ఆర్థిక కేంద్రాలను లక్ష్యం చేసుకుని వాటిని ఛిన్నాభిన్నం చేస్తామని హెచ్చరించారు. ముంబై దాడుల నేపథ్యంలో పాకిస్తాన్ లో ఉగ్రవాద గ్రూపులపై నిషేధాన్ని ఆయన వ్యతిరేకించారు. పాకిస్తాన్ లో ప్రభుత్వాన్ని, అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీని కూలదోయాలని ఆయన ప్రజలను కోరారు.