ఒకే వేదికపై బాలయ్య, పురంధరేశ్వరి
బాలకృష్ణ తెలుగుదేశం పార్టీకి ప్రచారం చేస్తుండగా, పురంధరేశ్వరి కాంగ్రెస్ పార్టీలో ఉన్న విషయం తెలిసిందే. ఈ స్థితిలో వారు ఒకే వేదిక మీదికి రావడం ఆసక్తికరంగా మారింది. హైదరాబాద్లోని రావినారాయణరెడ్డి ఆడిటోరియంలో సోమవారం రాత్రి 'వెంకటాద్రి' చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం జరిగింది. ఇందులో పాల్గొనడానికే వీరందరూ వచ్చారు. తారకరత్న కథానాయకుడిగా నటించిన ఈ చిత్రానికి సముద్ర దర్శకత్వం వహించారు.
Comments
Story first published: Tuesday, February 10, 2009, 9:26 [IST]