హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అసూయతోనే వెళ్లిపోతున్నారు: చిరు

By Staff
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
హైదరాబాద్: తమపై అసూయతోనే కొంత మంది తమ పార్టీ నుంచి వెళ్లిపోతున్నారని ప్రజారాజ్యం అధినేత చిరంజీవి అన్నారు. అవకాశం ఉన్నా ఆధిపత్యం కోసం ప్రయత్నించి కుదరక అసూయతో పార్టీ నుంచి వెళ్లిపోతున్నారని ఆయన విమర్శించారు. గుంటూరు జిల్లాలో పర్యటిస్తున్న ఆయన మంగళవారం ఉదయం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. అధిక ప్రాధాన్యం కల్పించినా పార్టీలో సామాజిక న్యాయం కల్పించలేదని నారగోని లాంటి వాళ్లు అసత్య విమర్శలు చేస్తున్నారని ఆయన అన్నారు. తాను ఎవరిపైనా వ్యక్తిగత విమర్శలు చేయబోనని, తనపై వచ్చే వ్యక్తిగత విమర్శలు ప్రతిస్పందించబోనని ఆయన చెప్పారు.

సత్యం కుంభకోణం ప్రపంచంలోనే అతి పెద్దదని, ఈ కుంభకోణంపై దర్యాప్తు విషయంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఆయన అన్నారు. సత్యం కుంభకోణంపై మొదటనే సిబిఐ, సెబీలతో విచారణ జరిపించి ఉంటే కొంత బయటకు వచ్చి ఉండేదని ఆయన అన్నారు. శాసనసభలో చర్చ తప్పు దారి పడుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. తాము అధికారంలో వస్తే కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీల అవినీతిపై విచారణ జరిపిస్తామని చిరంజీవి చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X