హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఇంజినీరింగ్ కాలేజిలో ఉద్రిక్తత

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: హైదరాబాద్ ఉప్పల్‌సమీపంలోని నల్ల మల్లారెడ్డి ఇంజనీరింగ్‌ కాలేజీలో ఈరోజు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇక్కడ మూడురోజులుగా విద్యార్థులకు, యాజమాన్యానికి మధ్య ఘర్షణ జరుగుతోంది. కొందరు విద్యార్థుల ఫీజుల గురించి అడిగేందుకు వెళ్లిన తమపై యాజమాన్యం దౌర్జన్యానికి పాల్పడిందంటూ విద్యార్థులు మూడురోజులుగా ఆందోళనకు దిగారు.

ఉప్పల్‌ పోలీస్‌స్టేషన్‌లో యాజమాన్యం, విద్యార్థులు పరస్పరం కేసులు పెట్టుకున్నారు. ఈరోజు ఉదయం కాలేజీకి చెందిన రెండు బస్సులను గుర్తు తెలియని వ్యక్తులు దహనం చేశారు. మరో రెండు బస్సులను ధ్వంసం చేశారు. ఇది విద్యార్థుల పనేనని యాజమాన్యం ఆరోపించింది. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X