వైయస్ ప్రేలాపనలు: బాబు
ప్రణబ్ ముఖర్జీ సోమవారం ప్రతిపాదించిన బడ్జెట్ ను ఆయన డొల్లగా అభివర్ణించారు. ఆర్థిక మాంద్యాన్ని తట్టుకోవడానికి బడ్జెట్టులో జరిపిన కేటాయింపులు హాస్యాస్పదంగా ఉన్నాయని ఆయన అన్నారు. ఆర్థిక మాంద్యాన్ని తట్టుకోవడానికి కేటాయించిన 40 వేల కోట్ల రూపాయలు ఏ మూలకు కూడా సరిపోవని ఆయన అన్నారు. రైల్వే బడ్జెట్టులో రాష్ట్రానికి మొండిచేయి చూపితే ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి చేతులు ముడుచుకుని కూర్చున్నారని ఆయన వ్యాఖ్యానించారు. మత్స్యశాఖ ఈఈ వెలుగంటి సూర్యనారాయణ కేసులో మంత్రుల బాగోతాలు బయటపడతాయని చార్జిషీట్ దాఖలు చేయలేదని ఆయన అన్నారు.
Story first published: Monday, February 16, 2009, 16:49 [IST]