ఖమ్మం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఇక ఖమ్మం ఎజెన్సీలో పవన్

By Staff
|
Google Oneindia TeluguNews

Pawan Kalyan
ఖమ్మం: యువరాజ్యం అధినేత పవన్‌ కల్యాణ్‌ ఈనెల 19నుంచి మూడురోజులపాటు ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. ఆయన పర్యటన దాదాపు అంతా ఏజెన్సీ ప్రాంతంలోనే సాగనుంది. ఈ నెల 19వ తేదీన హెలికాప్టర్లో ఆయన భద్రాచలం చేరుకుంటారు. అనంతరం ఎర్రంపేటలో ఆయన తన యాత్ర ప్రారంభిస్తారు. అక్కడినుంచి చింతూరు చేరుకుని బహిరంగసభలో ప్రసంగిస్తారు.

ఆ తర్వాత పోలవరం ముంపుగ్రామాల ప్రజలతో మాట్లాడతారు. అనంతరం భద్రాచలంలో బహిరంగసభలో పాల్గొంటారు. మర్నాడు ఉదయం భద్రాద్రి రాముడిని దర్శించుకున్నారు. మణుగూరులో రోడ్‌ షో నిర్వహించి పాల్వంచలో బహిరంగసభలో పాల్గొంటారు. రాత్రి అక్కడే బస చేస్తారు. మూడవరోజు తెలుగుదేశం పార్టీ నేత తుమ్మల నాగేశ్వరరావు సొంతగ్రామంలో ఆయన పర్యటిస్తారు. అనంతరం రామవరం వద్ద మదర్‌థెరిస్సా, మహాత్మాగాంధీ విగ్రహాలను ఆవిష్కరిస్తారు. సాయంత్రం ఖమ్మంలో బహిరంగసభలో పాల్గొని రాత్రికి అక్కడే బసచేసి 22 ఉదయం హైదరాబాద్‌ వెళతారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X