వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైయస్ మాఫియా: చంద్రబాబు

By Staff
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
న్యూఢిల్లీ: రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి మాఫియాగా మారారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. ప్రపంచంలోనే అతి పెద్ద సత్యం కార్పోరేట్ కుంభకోణంలో వైయస్ పాత్ర ఉందని, దీనికి ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ సమాధానం చెప్పాలని ఆయన అన్నారు. సిపిఐ ప్రధాన కార్యదర్శి ఎబి బర్దన్, సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యుడు సీతారాం ఏచూరి, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావులతో కలిసి ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. వైయస్ అర్థిక నేరాలపై చర్యలు తీసుకోకపోతే ప్రపంచంలో దేశం పరువు పోతుందని ఆయన అన్నారు. వైయస్ కుటుంబం వేలాది కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించిందని ఆయన ఆరోపించారు. అవినీతి సొమ్మును వైయస్ కుటుంబం విదేశీ బ్యాంకుల ద్వారా తీసుకుని వస్తోందని ఆయన అన్నారు. వైయస్ కుటుంబ సభ్యులు అన్ని రకాల చట్టాలను ఉల్లంఘించారని ఆయన అన్నారు.

కాంగ్రెసు పార్టీకి వైయస్ నిధులు సమకూరుస్తున్నారని, ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కువ మంది పార్లమెంటు సభ్యులున్నారని, దీంతో వైయస్ పై కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడానికి వెనకాడుతోందని ఆయన అన్నారు. వైయస్ ఆర్థిక నేరాలను అన్ని రాజకీయ పార్టీల దృష్టికి తెస్తున్నామని, కేంద్ర ప్రభుత్వ దృష్టికి తెస్తున్నామని ఆయన చెప్పారు. వైయస్ ను, ఇతరులను ప్రాసిక్యూట్ చేయాలని సీతారాం ఏచూరి డిమాండ్ చేశారు. కేవలం తాము ఆరోపణలు చేయడం లేదని, వైయస్ నేరాలకు సాక్ష్యాలున్నాయని ఆయన అన్నారు. దానిపై ఏం చేయాలనేది ప్రభుత్వం నిర్ణయించుకోవాలని, చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత మాత్రం ప్రభుత్వంపై ఉందని ఆయన అన్నారు. వైయస్ పై చర్యకు యుపిఎలోని కాంగ్రెసేతర పార్టీలు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని ఏచూరి విజ్ఞప్తి చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X