హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

లొంగిపోయిన సాంబశివుడు అరెస్టు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ప్రభుత్వానికి లొంగిపోయిన మాజీ మావోయిస్టు నేత కోనాపురి ఐలయ్య అలియాస్ సాంబశివుడిని పోలీసులు శుక్రవారం ఉదయం అరెస్టు చేశారు. ఆయనను విచారణ నిమిత్తం మహబూబ్ నగర్ కు తరలించారు. సాంబశివుడిపై దాదాపు 88 కేసులున్నాయి. వీటిలో శాసనసభ్యుడు నర్సిరెడ్డి హత్య కేసు, ఎస్పీ లడ్హాపై దాడి కేసు ఉన్నాయి. సాంబశివుడి ఉన్నవాటిలో 15 హత్య కేసులు. అతనిపై వివిధ జిల్లాల్లో ఉన్న కేసుల్లో అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

అయితే, సాంబశివుడి కుటుంబ సభ్యులు అరెస్టుపై విచారం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ పునరావాస ప్యాకేజీని నమ్మి తమ కుమారుడు లొంగిపోయాడని, దాన్ని ఇవ్వకుండా అరెస్టు చేయడం సరైంది కాదని సాంబశివుడి తల్లిదండ్రులు అంటున్నారు. తమ కుమారుడిపై ఉన్న కేసులను ఎత్తివేసి సామాన్య పౌరుడిగా జీవించే వెసులుబాటు కల్పించాలని వారంటున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X