హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్..శివుడా..శిలువా?

By Staff
|
Google Oneindia TeluguNews

Bandaru Dattatreya
హైదరాబాద్: చిన్ననాటి నుండి ముఖ్యమంత్రి వైఎస్‌ శివతత్వాన్ని ఆరాధిస్తే ఆయన ఇంట్లో వాళ్లందరూ శిలువనెందుకు ప్రార్థిస్తున్నారంటూ ప్రశ్నించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండారు దత్తాత్రేయ. మహా శివరాత్రిని పురస్కరించుకుని ప్రభుత్వం ఇచ్చిన ప్రకటనలపై దత్తాత్రేయ పై విధంగా విరుచుకుపడ్డారు. ఇది కుటుంబ వైరుధ్యమా..మానసిక వైరుధ్యమా చెప్పాలన్నారు. ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రికి సోమవారం 142వ బహిరంగలేఖ రాశారు.

శివతత్వాన్ని వైఎస్‌ అర్థం చేసుకున్న తీరు జగన్మోహనీయమని, ద్వాదశ జ్యోతిర్లింగాల సృష్టి మన్మోహనీయమని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. మైనార్టీ ఓట్ల జపం చేసే సెక్యులర్‌ కొంగలు అలవర్చుకోదగిన పాఠం, అనుసరించాల్సిన మార్గాన్ని ప్రజాధనంతో అందించారన్నారు. ప్రభుత్వ పథకాలకు ఆథ్యాత్మిక రంగులద్దిన ఆయన మిథ్యా భక్తికి వైష్టవ మాయ సైతం తలొంచాల్సిందేననని వెటకారం చేసారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X