ఇద్దరు శివభక్తులు సజీవ దహనం
ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలో శివరాత్రి నాడు ఇద్దరు శివ భక్తులు అగ్ని గుండంలో దూకి సజీవ దహనం అయ్యారు. జైనూరు మండలం, శివలూరు తండాలో ఈ ఘటన చోటుచేసుకుంది. సోమవారం మహాశివరాత్రి సందర్భంగా ఆ తండాలో మంగళవారం తెల్లవారు జామున ఏర్పాటు చేసిన అగ్నిగుండం పైకి ఎక్కి ఒక్కసారిగా ఇద్దరు యువకులు దూకి సజీవ దహనం అయ్యారు. ప్రక్క నున్నవారు ఎంత చెప్పినా వినిపించుకోలేదని, అప్పటికే వారిద్దరూ పూనకంతో ఊగుతున్నారని, ఆ సమయంలో ఎవరు ఏమి చెప్పినా వినే పరిస్థితి ఉండదని స్థానికులు పేర్కొన్నారు.
ఉపవాసం ఉండి అగ్ని గుండంలో దూకిన వారికి శివ ప్రాప్తి లభిస్తుందని ఒక మూఢ నమ్మకం ఆ గిరిజనులలో ఉంది. ఇద్దరు యువకులు మృతి చెందడంతో ఆ గ్రామంలో విషాదం అలుముకుంది.
Story first published: Tuesday, February 24, 2009, 14:20 [IST]