బస్సులు దగ్ధం చేసిన మాదిగలు
హైదరాబాద్: జంటనగరాల్లో ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు అర్థరాత్రి విధ్వంసానికి పాల్పడ్డారు. ఎల్బీస్టేడియం, రేతిఫైల్ బస్టాపుల వద్ద రెండు ఆర్టీసీ బస్సులను దగ్ధం చేశారు. ఎస్సీ వర్గీకరణ కోరుతూ రోజూ విధ్వంసానికి దిగుతున్న ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు.
అర్థరాత్రి 12 గంటల ప్రాంతంలో సికింద్రాబాద్ రేతిఫైల్ బస్టాప్ వద్ద ఆగి ఉన్న రాణిగంజ్-2 డిపో బస్సుకు ఒకటిన్నర గంటల ప్రాంతంలో ఎల్బీస్టేడియం వద్ద ముషీరాబాద్ డిపోకు చెందిన మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుకు నిప్పంటించారు. ఈ ఘటనలో బస్సులు పూర్తిగా కాలిపోయాయి. బస్సులను దహనం చేసింది తామేనని అనంతరం వారు పలు ఛానళ్ల కార్యాలయాలకు ఫోన్లు చేశారు.
Comments
Story first published: Thursday, February 26, 2009, 11:55 [IST]