చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రెహమాన్‌ కి ఘన స్వాగతం

By Staff
|
Google Oneindia TeluguNews

AR Rahman
చెన్నై: దుబాయ్‌ విమానంలో గురువారం తెల్లవారుజామున 2.30 గంటల ప్రాంతంలో రెండు ఆస్కారులను చేత బట్టుకొని సొంత గడ్డ మీద అడుగుపెట్టిన రెహమాన్‌ను కనులారా చూసేందుకు వేలాది మంది అభిమానులు, ప్రజలు ఎయిర్‌పోర్టు వద్ద పోటెత్తారు. భారత్ ప్రతిష్టను ప్రపంచంలో సగర్వంగా నిలిపిన 'స్లమ్‌ డాగ్‌ మిలీయనీర్‌' చిత్ర బృందం ఇండియా చేరుకొంది. ముంబై, చెన్నై ఎయిర్‌పోర్టుల్లో దిగిన ఆస్కార్‌ విజేతలకు 'జయ హో' అంటూ దేశం యావత్తు ఎదురేగి స్వాగతం పలికింది. మ్యూజిక్‌ మేస్ట్రో ఎ.ఆర్‌.రెహమాన్‌కు చెన్నై ఎయిర్‌పోర్టులో ఘన స్వాగతం లభించింది.

ఇక ఎయిర్‌పోర్టులో దిగిన ఆయనకు బాల్యమిత్రుడు శివమణి తన బృందంతో కలిసి 'జయ హో' గీతాన్ని డ్రమ్‌లపై పలికిస్తూ వినూత్న ఆహ్వానం కలిపారు. భారీ డ్రమ్‌ను వాయిస్తూ ఎయిర్‌పోర్టు బయట వరకు తోడ్కొని వచ్చారు. తోటి కళాకారులు, నటులు, కుటుంబ సభ్యులు, స్నేహితుల శుభాకాంక్షలు, అభినందల మాలలతో రెహమాన్‌ ఉక్కిరిబిక్కిరయ్యారు. ప్రేమాభిమానాలతో తనను దాదాపు చంపేశారని నవ్వుతూ మీడియాతో అన్నారు. అలాగే, 'స్లమ్‌ డాగ్‌..' చిత్రంతో ప్రపంచం దృష్టిని కట్టి పడేసిన ముంబై మురికివాడకు చెందిన బాల నటులను ముంబై ఎయిర్‌పోర్టులో పుష్ప మాలలతో ముంచెత్తారు.

అలాగే మరో ఆస్కార్‌ విజేత, సౌండ్‌ మాంత్రికుడు రసూల్‌ పోకుట్టి, నటుడు ఇర్ఫాన్‌ ఖాన్‌కు కూడా అదే స్థాయిలో స్వాగత సత్కారాలు లభించాయి. ఆస్కారులను అందుకున్న వేళ కన్నతల్లిని చెమర్చిన నేత్రాలతో గుర్తు చేసుకొన్న రెహమాన్‌..జన్మభూమిని కూడా సమున్నతంగా స్మరించుకొన్నారు. తనకు లభించిన పురస్కారాలను భారతీయ కళాకారులకు అంకితం చేస్తున్నట్టు ప్రకటించి..దేశీయ చిత్ర పరిశ్రమకు ఎనలేని గౌరవం కల్పించారు.

గురువారం చెన్నైలో అభిమానులు, స్నేహితులు, కుటుంబ సభ్యుల ఆనందోత్సహాల మధ్య తన నివాసంలో రెహమాన్‌ మీడియాతో మాట్లాడారు. భారతీయ సినిమాకు ఉజ్వల భవిష్యత్‌ ఉన్నదని, రానున్న కాలంలో మరిన్ని ఆస్కారులు వరించడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. అవార్డు పొందడం కన్నా, ఆ వేదికపై స్టేజ్‌ షో ఇవ్వడం తనకు ఆనందం కలిగించిందని చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X