వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇదే హీన ప్రభుత్వం: అద్వానీ

By Staff
|
Google Oneindia TeluguNews

LK Advani
న్యూఢిల్లీ: ప్రస్తుత లోక్‌ సభ హయాంలోని యూపీఏ ప్రభుత్వమే దేశచరిత్రలో అత్యంత హీన ప్రభుత్వమని భారతీయ జనతా పార్టీ అగ్రనేత ఎల్‌.కె.అద్వానీ తీవ్రంగా విమర్శించారు. గురువారం 14వ లోక సభ చిట్టచివరి సమావేశాల ముగింపు రోజున ఆయన లాంఛనపూర్వక ప్రసంగం చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. అలాగే ఈ ప్రధానమంత్రికి అసలు విలువే లేదని, పలు తప్పులకు గాను ఈ లోక్‌ సభ గుర్తుండిపోతుందని, అందులో పెద్ద తప్పు ప్రధానమంత్రి కార్యాలయాన్ని అచేతనం చేసి విలువ లేకుండా చేయడమేనని వ్యాఖ్యానించారు.

ప్రధానమంత్రిగా పనిచేయాలంటే కచ్చితంగా లోక్‌సభ సభ్యుడై ఉండాలని స్పష్టం చేసేలా రాజ్యాంగానికి సవరణ చేయాలన్నారు. ప్రధానమంత్రికి కార్యాలయం ఉంది కాని అధికారం లేదన్నారు. ఈ విషయం భారత పౌరులందరికీ, కాంగ్రెస్‌ ఎంపీలకు, మంత్రులకు, యూపీఏ భాగస్వాములకు కూడా తెలుసని అన్నారు. "ఈ లోక్‌ సభ చిట్టచివరి సమావేశపు చివరి రోజు ఇది. ప్రజలు ఇక కొత్త లోక్‌ సభను ఎన్నుకుంటారు. మరో రెండు మూడురోజుల్లో ఎన్నికల తేదీలను ప్రకటిస్తారని భావిస్తున్నాను" అని అద్వానీ అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X