హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సురేందర్‌ మృతికి వైఎస్సే ..మంద కృష్ణ

By Staff
|
Google Oneindia TeluguNews

Manda krishna
హైదరాబాద్‌ :సురేందర్‌ మృతికి వైఎస్సే కారణమని, కాంగ్రెస్‌ తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని మందకృష్ణ మాదిగ వ్యాఖ్యానించారు. గాంధీభవన్‌ తగులబెట్టిన ఘటనలో తీవ్రంగా గాయపడిన సురేందర్‌ మాదిగ ఈ రోజు మృతిచెందారు.ఈ వార్త తెలిసి ఇమేజ్‌ ఆసుపత్రికి చేరుకున్న మందకృష్ణ మాదిగ సురేందర్‌ మృతి పై ప్రభుత్వంపై విరుచుకు పడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా మాదిగవాడల్లో కాంగ్రెస్‌ జెండాలు తొలగించి నల్లజెండాలు ఎగరేస్తామని ఆయన అన్నారు. సురేందర్‌ మృతికి వారంరోజుల పాటు సంతాపం పాటించాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం ఆసుపత్రి వద్ద మందకృష్ణ ఆధ్వర్యంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన నిర్వహించారు.

ఎస్సీ వర్గీకరణ చేస్తామని కాంగ్రెస్‌ ప్రభుత్వం మోసం చేసిందని గత కొద్దిరోజులుగా ఎమ్మార్పీఎస్‌ కార్యకర్తలు నిరసనల పేరిట దాడులకు పాల్పడుతోంది. దీనిలో భాగంగా శనివారం గాంధీభవన్‌లో ఎమ్మార్పీఎస్‌ కార్యకర్తలు సృష్టించిన విధ్వంసాన్ని సృష్టించిన ఘటనలో గాయపడి ఇమేజ్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిలో ఆదివారం ఉదయం సురేందర్‌ మాదిగ మృతి చెందారు. ఈ నేపథ్యంలో దామోదర్‌ పరిస్థితి విషమంగా ఉందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.సురేందర్‌ మృతి పట్ల ఆసుపత్రిలో బంధువుల రోదనలు మిన్నంటాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X