పళ్ళు రాల కొడ్తా: రోజా
హైదరాబాద్:తనపై,తన క్యారెక్టర్ పై కామెంట్స్ చేస్తే పళ్ళు రాలకొడ్తా అంటూ తీవ్రంగా విరుచుకుపడ్డారు తెలుగు దేశం మహిళా అధ్యక్ష్యురాలు రోజా. గత రెండు రోజులుగా ప్రజారాజ్యం మహిళారాజ్యం నేత శోభారాణికి,రోజాకీ మధ్య జరుగుతున్న వాగ్యుద్ధం గురించి ఓ ప్రెవేట్ ఛానెల్ వారు అడిగిన ప్రశ్నకు ఆమె పై విధంగా స్పందించారు. రాజకీయాల్లో విమర్శలు,ప్రతి విమర్శలు ఉంటాయని,అంత మాత్రనికి క్యారెక్టర్ ని ఉద్దేశించి మాట్లాడటం సబబు కాదని ఆమె అన్నారు. తను తిట్టడానికి కారణం అవతలివారు రెచ్చకొట్టడమేనని అన్నారు.
అలాగే చిరంజీవి పనిగట్టుకొని మరీ నన్ను తిట్టించారు. అకారణంగా, అసందర్భం గా విమర్శించారు. మానసికంగా క్షోభకు గురిచేసి రాజకీయంగా దెబ్బతీయడానికి ఈ మాటలు అనిపించారు. ఇలా ఇతరులను తిట్టేందుకే కొందరిని పార్టీలో చేర్చుకుంటున్నారు. ప్రజారాజ్యం దిగజారుడు రాజకీయానికి వారి విమర్శలే నిదర్శనం. వారికీ, ఊరకుక్కలకు తేడా లేదు. నాపై విమర్శల ద్వారా సినీ రంగంలోని నటీమణులను, మహిళలందరినీ అవమానించారంటూ మళ్ళీ అదే పాట పాడారు.